योगी सरकार का बड़ा तोहफा, संस्कृत की पढ़ाई कर रहे छात्रों को मिलेगी 6000 रुपये तक की स्कॉलरशिप
Scholarship: విద్యార్థులకు ఏటా రూ.35 వేల స్కాలర్షిప్.. వివరాలు ఇవీ..
Scholarship: విద్యార్థులకు శుభవార్త. ప్రతి ఏటా రూ.35 వేల స్కాలర్షిప్ పొందే సదావకాశం దక్కింది. చదువులో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రతి ఏటా భారీ మొత్తంలో ఉపకారవేతం ఇచ్చేందుకు బాష్ ఇండియా సంస్థ ముందుకు వచ్చింది.
విద్యార్థులకు శుభవార్త. ప్రతి ఏటా రూ.35 వేల స్కాలర్షిప్ పొందే సదావకాశం దక్కింది. చదువులో ప్రతిభ కనబరిచే విద్యార్థులకు ప్రతి ఏటా భారీ మొత్తంలో ఉపకారవేతం ఇచ్చేందుకు బాష్ ఇండియా సంస్థ
ముందుకు వచ్చింది. కార్పొరేట్ కంపెనీలు అందించే స్కాలర్షిప్ను విద్యార్థులకు అందించే ఎన్ఎస్డీఎల్ ఈ-గవర్నెన్స్ విద్యాసారథి పోర్టల్తో బాష్ ఇండియాకు చెందిన ప్రైమెవెరా ఇండియా ట్రస్ట్తో చేతులు కలిపింది. దాని సహాయంతో అర్హులైన ఇంటర్, డిప్లొమా, బీఏ, బీకాం, బీఎస్సీ, బీఈ/బీటెక్ విద్యార్థులకు స్కాలర్షిప్ అందించనుంది.
ఈ సందర్భంగా ఎన్ఎస్డీఎల్ ఈ-గవర్నెన్స్ ఎండీ, సీఈవో గగన్ రాయ్ మాట్లాడుతూ.. ఇప్పటికే 7.5 లక్షల మంది విద్యార్థులు విద్యాసారథి పోర్టల్ ద్వారా లబ్ధి పొందుతున్నారని, తాజాగా.. బాష్ ఇండియా కూడా దీనిలో చేరడం ద్వారా మరింత మందికి ఉపకార వేతనాలు అందనున్నాయని తెలిపారు.

Comments
Post a Comment